వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డుప్రమాదంలో10 మంది మృతి
మహబూబ్ నగర్ః మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ చౌరాస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది మందిదుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్సు ఆటో డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు.వీరిని చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
మహబూబ్ నగర్ నుంచి అలంపూర్ వస్తున్న ఆర్టీసి బస్సు అలంపూర్ చౌరాస్తా వద్ద ఆటోను డీకొంది. ఈ దుర్ఘటనలో ఆటో నుజ్జునుజ్జుఅయింది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో మహిళ మరణించింది. ఈ దుర్ఘటనతో ఏడోనెంబర్ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. మృతులంతా అలంపూర్, కర్నూలు కు చెందిన వారు.
Story first published: Friday, October 5, 2001, 23:53 [IST]