వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడపలో 50 మంది గల్లంతు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో తాజా తుపాను నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మంగళవారం నాడు ఉదయం నెల్లూరులో తీరం దాటినప్పటికీ దీని ప్రభావం వల్ల రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలకు తోడుగా కడప జిల్లాలో వాగులు వంకలు పొంగి అధికారులు హెచ్చరికలు లేకుండా బుగ్గవంక ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు ఎత్తివేయడంతో ఒక్కపెట్టున కడప పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. కనీసం 50 మంది గల్లంతయినట్టుగా వార్తలుఅందాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఊళ్లో కనీసం పదడుగుల ఎత్తున నీరు నిలిచినట్టుగా చెబుతున్నారు.

కడపకు బయటప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వందలాది మంది వర్షంలోనే మేడలు,మిద్దెలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గల్లంతయిన వారంతా జలసమాధిఅయివుంటారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరులో రెండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడపలో మరో వెయ్యిమందిని తరలించారు. అనంతపురం జిల్లాలోని లోతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. తుపాను తీవ్రత మరో 24 గంటలు వుండే అవకాశం వున్నదనిఅంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X