వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామాను అప్పగించడం కల్లో మాట

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఒసామాబిన్‌ లాడెన్‌ను అప్పగించడానికి తాలిబన్లు సిద్ధంగా వున్నారంటూ వచ్చిన వార్తలను తాలిబన్‌ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తటస్థ దేశానికి లాడెన్‌ను అప్పగించడానికి తాము సిద్ధంగా వున్నట్టుగా వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, సత్యదూరమని తాలిబన్‌ పేర్కొంది.

ఇస్లాం రాజ్యమైనఅఎn్గాన్‌కు వ్యతిరేకంగా పశ్చిమదేశాల మీడియా ఎక్కుపెట్టిన ప్రచారంలో భాగంగానే ఈరకమైన వార్తలను ప్రచారం చేస్తున్నారని తాలిబన్లుపేర్కొన్నారు. కొన్ని పశ్చిమ దేశాల పత్రికలు తాలిబన్‌ నేతలతో ఇంటర్వ్యూలపేరుతో తమ చిత్తం వచ్చిన రాతలు రాస్తున్నాయని కూడా వారు ఆరోపించారు. తాలిబన్లుసమైక్యంగా వున్నారని తాలిబన్లలో ఫిరాయింపులు లేవని స్పష్టం చేశారు. అమెరికా దాడుల్లో అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారని కూడా తాలిబన్లుపేర్కొన్నారు. గురువారం నాటి దాడుల్లో కాందహార్‌లో పదిహేను మంది మరణించినట్టుగా తెలిపారు. ఒసామాబిన్‌ లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా వద్ద పక్కా సాక్ష్యాలు వుంటేఅఎn్గానిస్తాన్‌లోని ఇస్లామిక్‌ కోర్టులోనే విచారణ జరిపిస్తామని మరోసారి తాలిబన్లు స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X