వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌తో చర్చలు వుండవు: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: పాకిస్థాన్‌తో అధికారిక చర్చలు జరిపే ప్రసక్తి లేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. కాశ్మీర్‌పై భారత్‌ వైఖరిలో మార్పు లేదని ఆయన చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌తో ఇదేవిషయం స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్‌తో తాము మాట్లాడుతూనే వున్నామని, అయితే అధికారిక చర్చలకు మాత్రం తావు లేదని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తి కుమారుడిపెళ్లికి హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీతో పాటు ప్రధాని బుధవారం సాయంత్రం చెన్నై వచ్చారు. వారిరువురు గురువారం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీనికి ముందు ప్రధాని కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పావెల్‌తో చర్చలుస్నేహపూర్వకంగా, స్వేచ్ఛగా జరిగాయని వాజ్‌పేయి చెప్పారు.

అయోధ్యలోని రామజన్మభూమి వివాదాస్పద స్థలంలో గల బాబ్రీ మసీదు గర్భగుడిలోకి నలుగురువిశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) నాయకులు ప్రవేశించడాన్నివిలేకరులు ప్రస్తావించగా భద్రతా వైఫల్యం వల్లనే అది జరిగిందని ఆయన చెప్పారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఆయన చెప్పారు. గర్భగుడిలోవిశ్వ హిందూ పరిషత్‌ వాలంటీరు ఉన్నాడని ఆయన చెప్పారు.

అన్నాడియంకె ప్రభుత్వంపై డిఎంకె నేత కరుణానిధి చేస్తున్నవిమర్శలు వాస్తవమైతే అన్నాడియంకె ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X