గ్రేట్ మాల్లో వ్యాపారుల సత్యాగ్రహం
హైదరాబాద్ః అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన గ్రేట్మాల్ ఆఫ్ హైదరాబాద్ షాపింగ్ ఫెస్టివల్లో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. నిర్వాహకులు ఒగ్లివి లైవ్ బాధ్యతారాహిత్యం, టూరిజం శాఖ ప్రేక్షక పాత్ర మూలంగా వ్యాపారస్తులు నష్టాలను చవిచూస్తున్నారు.
మూడు నాలుగు రోజుల క్రితం ఫుడ్ స్టాల్స్ వ్యాపారులు ఆందోళనకు దిగగా ఇప్పుడు తాజాగా వినియోగ వస్తువుల స్టాళ్ల యజమానులు సత్యాగ్రహం చేపట్టారు. దుబాయి, సింగపూర్ తరహాలోఫెస్టివల్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పగా నిర్వాహకులు మాత్రం డబ్బులు దండుకోవడం పై మాత్రమే దృష్టిపెట్టారు.
వ్యాపారం ఏ మాత్రం సాగకున్నా చార్టీలు చెల్లించకతప్పడం లేదని వ్యాపారులు లబోదిబో మంటున్నారు. నాక్ గ్రౌండ్స్లోని విలేజి-2 వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి ఆందోళనకు దిగారు. కిరాయి కింద చెల్లించిన మొత్తంలో కనీసంసగమైనా వాపస్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని లేదంటే సందర్శకులను రప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.