తెలంగాణావాదుల నిరసన హోరు
హైదరాబాద్ఃఒకవైపు
రాష్ట్రావతరణ
దినోత్సవాలు
జరుపుకుంటుండగా
ప్రత్యేక
తెలంగాణా
వాదులు
రాష్ట్రరాజధాని
నగరంతో
పాటు
వివిధ
తెలంగాణా
జిల్లాలలో
నిరసన
తెలిపారు.
హైదరాబాద్ లోని తెలంగాణా అమరవీరుల స్మారక స్థూపం వున్న గన్ పార్క్ వద్ద ప్రత్యేక తెలంగాణా కోరుతున్న అన్ని పార్టీల నేతలు చేరుకొని ప్రత్యేక తెలంగాణా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా గన్ పార్క్ చేరుకున్న ప్రముఖ కవి కాళోజి నారాయణరావు చంద్రబాబు వైఖరినివిమర్శించారు. చేనేత కార్మికులు, రైతులు అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు ఏ ముఖంపెట్టుకొని ఉత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా ఎమ్మెల్లేలంతా గన్ పార్క్ వద్దకు చేరుకొని ప్రత్యేక తెలంగాణా సాధన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని చెప్పారు. చంద్రశేఖరరావుకు చెందిన తెలంగాణా రాష్ట్ర సమితి నేతలు, బిజెపి ఎంపి నరేంద్రకు చెందిన తెలంగాణా సాధన సమితికి చెందిన నేతలు గన్ పార్క్ కు చేరుకొనడంతో అక్కడ కోలాహలం నెలకొంది. తెలంగాణా రాష్ట్ర సమితి కంటే నరేంద్రకు చెందిన తెలంగాణా సాధన సమితి కార్యకర్తలు, నేతల కోలాహలం అధికంగా కనిపించింది. హైదరాబాద్ తో పాటు వివిధ తెలంగాణా జిల్లాలలో కూడా ప్రత్యేక తెలంగాణా కోరుతూ వివిధ కార్యక్రమాలు జరిగాయి.