న్యూయార్క్ః అమెరికాపై టెర్రరిస్టుల దాడి దరిులా న్యూయార్క్లో తొలిసారిగా జరుగుతున్న ఐక్యరాజ్యసుతి సర్వసభ్య సమావేశానికి అసాధారణ స్థాయిలో భద్రతాఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ప్రారంభమవుతున్న ఈ సమావేశాలకుసుమారు 50 దేశాల అధినేతలు, మరో 120 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు.
39 అంతస్తుల ఐక్యరాజ్య సుతి భవనంలో సమావేశం జరుగుతున్నహాలుకు సుతి సిబ్బందిని కూడా అనుమతించడం లేదు. భారత ప్రధాని వాజ్పేయి, పాకిస్తాన్ నేత ముషారఫ్తో సహా పలుదేశాల నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్న షయం దితమే. సీమాంతర ఉగ్రవాదాన్ని గురించి వాజ్పేయి, కాశ్మీర్ సమస్య గురించి పాకిస్తాన్ ఈ సమావేశంలో లేవనెత్తే అవకాశం వుంది. ఈ సమావేశాల్లో చర్చ ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్రవాదంపైనే జరిగే అవకాశం వుంది.అఎn్గాన్పై అమెరికా దాడులను సమావేశం చర్చించి మద్దతు ప్రకటించే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications