వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగుళూరుః సైబర్‌ నేరలను అరికట్టేందుకు దేశంలోనే ప్రప్రధమంగా కర్ణాటక ప్రభుత్వంఏర్పాటు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తొలికేసును జయవంతంగా దర్యాప్తు చేశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ కేసుకు సంబంధించి జయకుమార్‌ అనే ఇంజనీరునుఅరెస్టు చేశారు. అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీకి బెదిరింపు మెయిల్స్‌ ఇవ్వడామే కాకుండా ఆ సంస్థ ఇ-మెయిల్‌సర్వర్‌ను క్రాష్‌ చేసిన ఆరోపణపై జయకుమార్‌నుఅరెస్టు చేశారు. అమెరికాకు చెందిన ఫొనిక్స్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థకు జయకుమార్‌ బెదిరింపు ఇ-మెయిల్స్‌ ఇచ్చారని భారత్‌లో కార్యకలాపాలను కట్టిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుందని హెచ్చరించారని తెలిసింది.

ఈ ఇ-మెయిల్స్‌ను సంస్థ మొదట పట్టించుకోలేదు. అయితే అమెరికాలోని తమ ఇ-మెయిల్‌సర్వర్‌ కుప్పకూలడంతో వారు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించి దర్యాప్తు చేసిన అధికారులు ఈ మెయిల్స్‌ పంపింది జయకుమార్‌ అని కనిపెట్టారు. ఇటి చట్టం కింద జయకుమార్‌నుఅరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్‌ జుడిషియల్‌ రిమాండ్‌కుపంపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X