కర్నూలుః తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆదివారం నాడు కర్నూలు జిల్లా ఆదోని వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎనిుది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ుగిలిన ప్రయాణికులంతా క్షేమంగా వున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ఘోర ప్రమాదం తప్పిందని రైల్వే వర్గాలు చెప్పాయి.
సుమారుఅరకిలోdుటరు మేర ట్రాక్ ధ్వంసం అయింది. గాయపడిన వారిని గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. ట్రాక్కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు.
సోమవారం ఉదయం కల్లా మరమ్మతు పూర్తయ్యే అవకాశం వున్నదనిరైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వచ్చేరైళ్ల రాకపోకలకు అంతరాయ కలగకుండా ఇతర రూట్లలోకి మళ్లించారు. కాగా రాయలసీమఎక్స్ప్రెస్ ప్రయాణికులు ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసినట్టుగారైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications