వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాషింగ్టన్ః తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అమెరికా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నది. తీవ్రవాదం గురించి, తీవ్రవాదుల గురించి ఏ మాత్రం ఉపయోగపడే సమాచారం అందించినా అమెరికాలో వుండేందుకు శాశ్వత పౌరసత్వాన్ని, వీసాను ఇవ్వనున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ ప్రకటించారు. తీవ్రవాదుల గురించి ఉపయోగపడే సమాచారం అందించే విదేశీలుయలకే ఈ పధకం వర్తిస్తుంది.
తీవ్రవాదుల గురించి సమాచారం తెలిసన వారు ఎఫ్.బి.ఐ.కి ఆ సమాచారాన్నిఅందించాల్సి వుంటుంది. అమెరికాను గడగడలాడిస్తున్న తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఈ పధకం బాగా ఉపయోగపడుతుందని బుష్ ప్రభుత్వం భావిస్తున్నది. పౌరసత్వం,వీసా సదుపాయం కల్పించి, తీవ్రవాదం గురించి పూర్తి సమాచారంసేకరించి, భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు సంభవించకుండా అడ్డుకోవాలన్నిది అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నది.
Comments
Story first published: Friday, November 30, 2001, 23:53 [IST]