వరంగల్: తెలంగాణ ఫోరమ్లు, కమిటీలు ఏర్పాటు చేయకూడదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి దల్జీత్ సింగ్ ఆదేశించారు. వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణపై భిన్న వేదికలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంఏర్పాటు డిమాండ్ పట్ల పార్టీ స్పష్టమైన విధానాన్ని చెప్పడానికి ఆయన నిరాకరించారు.
వరంగల్: తెలంగాణ ఫోరమ్లు, కమిటీలు ఏర్పాటు చేయకూడదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి దల్జీత్ సింగ్ ఆదేశించారు. వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణపై భిన్న వేదికలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంఏర్పాటు డిమాండ్ పట్ల పార్టీ స్పష్టమైన విధానాన్ని చెప్పడానికి ఆయన నిరాకరించారు.
తెలంగాణపై పార్టీకి స్పష్టమైన విధానం వుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణపై స్పష్టమైన విధానం లేకపోతే, తెలంగాణకు అనుకూలంగా కార్యకలాపాలు లేకుంటే తెలంగాణ ప్రాంతంలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని వారన్నారు. ఈ వాదనను దల్జీత్ సింగ్అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరదని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ్యులు ఒంటరివారు కారని, వారి వెనుక పార్టీ యావత్తూ వున్నదని ఆయన భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications