వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు చెందిన గ్రానైట్ కంపెనీనిపీపుల్స్ వార్ గ్రూప్ పేల్చివేసింది. మెదక్ జిల్లా వెల్దుర్తి సమీపంలో వున్న గోపీకృష్ణా గ్రానైట్ ఫ్యాక్టరీనిపీపుల్స్ వార్ నక్సలైట్లు శుక్రవారం తెల్లవారు జామునపేల్చి వేశారు. ఈ సంఘటనలో కనీసం పది కోట్లు రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన హెరిటేజ్ ఫ్యాక్టరీనిపేల్చివేసిన రోజునే కేంద్ర రక్షణ మంత్రి ఫ్యాక్టరీని కూడాపీపుల్స్ వార్ ధ్వంసం చేయడం విశేషం.
ఇటీవల కాలంలో ప్రముఖుల ఆస్తులను వార్ వరసపెట్టి ధ్వసం చేయడం ఇదే ప్రథమం. మెదక్ జిల్లాలోని బ్రాహ్మణపల్లి సమీపంలో వున్న ఓ కాఫీ ఫ్యాక్టరీని కూడా నక్సలైట్లు ధ్వసం చేశారు. ఆ తరువాత గజ్వేలు మండలం సింగాటం లోని తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటిని నక్సలైట్లుపేల్చి వేశారు. రెండు ట్రాక్టర్లను కూడా నక్సలైట్లు ఈ సందర్భంగా ధ్వంసం చేశారు. కనీసం 20 మంది నక్సలైట్లు పాల్గొన్న ఈ దుర్ఘటనలో 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లుఅంచనా.
Comments
Story first published: Friday, November 30, 2001, 23:53 [IST]