వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః దివంగత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీసీనియర్‌ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బుధవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన కోట్లకు నివాళిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు.సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, రైతుజన బాంధవుడిగాపేరుగాంచిన కోట్లకు ఆయన నివాళులు అర్పించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

కోట్లపేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు వీలుగా హైదరాబాద్‌ లో ప్రారంభించే బొటానికలా గార్డెన్‌ కు ఆయనపేరు పెడుతున్నామని, అక్కడ ఆయన శిలావిగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులోని తుగభద్రా తీరంలో కోట్ల స్మృతి చిహ్నంగా కిసాన్‌ ఘాట్‌ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన వున్నదని చంద్రబాబు చెప్పారు. కోట్ల వంటి మహా నాయకుడి స్మృతి చిహ్నంగాకె.సి. కెనాల్‌ కు ఆయన పేరు పెట్టాల్సిందిగా సి.ఎల్‌.పి నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజశేఖర రెడ్డి డిమాండ్‌ కు వివిధ ప్రతిపక్ష నేతలు మద్దతు పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X