వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః దివంగత మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డికి ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బుధవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన కోట్లకు నివాళిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు.సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, రైతుజన బాంధవుడిగాపేరుగాంచిన కోట్లకు ఆయన నివాళులు అర్పించారు.
కోట్లపేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు వీలుగా హైదరాబాద్ లో ప్రారంభించే బొటానికలా గార్డెన్ కు ఆయనపేరు పెడుతున్నామని, అక్కడ ఆయన శిలావిగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలులోని తుగభద్రా తీరంలో కోట్ల స్మృతి చిహ్నంగా కిసాన్ ఘాట్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన వున్నదని చంద్రబాబు చెప్పారు. కోట్ల వంటి మహా నాయకుడి స్మృతి చిహ్నంగాకె.సి. కెనాల్ కు ఆయన పేరు పెట్టాల్సిందిగా సి.ఎల్.పి నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి డిమాండ్ కు వివిధ ప్రతిపక్ష నేతలు మద్దతు పలికారు.
Comments
Story first published: Wednesday, December 19, 2001, 23:53 [IST]