వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ కు సాక్ష్యాలు చూపిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండూః గత పదేళ్ళలో భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి పాకిస్తాన్‌ లో వుంటున్న తీవ్రవాదలపై సాక్ష్యాధారాలను భారత్‌ గురువారం వెల్లడించింది. తమ దేశంలో వున్న తీవ్రవాదులు భారత్‌ లో అరాచకం సృష్టించినట్లు సాక్ష్యాధారాలు చూపాల్సిందిగా పాకిస్తాన్‌ భారత్‌ ను కోరిన విషయం విదితమే. పాక్‌ కోరిక మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జస్వంత సింగ్‌ సాక్ష్యాధారాలు వెల్లడించారు.

ముంబయ్‌ పేలుళ్ళ కేసు సూత్రధారులు, డిసెంబర్‌ 13న పార్లమెంటు భవనంపై దాడి చేసిన వారు, భారత్‌ విమానాన్ని హైజాక్‌ చేసిన వారితోపాటు, వారు ఆ చర్యలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను భారత్‌ విడుదల చేసింది. తీవ్రవాదుల్ని అరెస్టు చేశాం..... సాక్ష్యాలు చూపాల్సిందిగా పాక్‌ కోరడాన్ని జస్వంత్‌ సింగి తప్పు పట్టారు. ఇప్పుడు సాక్ష్యాలు చూపించాం.... వారిని భారత్‌ కు అప్పగించాలని జస్వంత్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. తీవ్రవాదులపై ఏ విధమైన చర్యలు తీసుకుందనే విషయాన్ని పాక్‌ ఇంత వరకు భారత్‌ కు అధికారికంగా చెప్పలేదని జస్వంత్‌ సింగ్‌ అన్నారు. కేవలం ప్రపంచాన్ని మభ్య పెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X