వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలైట్ల అడ్డుకున్నా ప్రగతిఆగదుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌ః నక్సలైట్లు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆంధ్రరాష్ట్రంలో మారుమూల పల్లెల అభివృద్ధిపై వెనక్కు తగ్గేది లేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 16వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన ఉత్తర తెలంగాణా జిల్లాల్లో పర్యటించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనూరులో జరిగిన గ్రామసభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించేందుకు పీపుల్స్‌ వార్‌ హత్యలు, కిడ్నాప్‌ లకు పాల్పడుతున్నదని చంద్రబాబు విమర్శంచారు.

దేవరకొండ ఎమ్మెల్ల్యే రాగ్యానాయక్‌ ను చంపిన పీపుల్స్‌ వార్‌ ఇప్పుడు క్షమాపణ చెబుతున్నదని ఆయన విమర్శించారు. హత్యాకాండ సృష్టిస్తున్న నక్సలైట్ల లక్ష్యం ఏమిటని ఆయన నిలదీశారు. నక్సలైట్లు ఎంత బెదిరించినా అభివృద్ధి విషయం రాజీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నక్సలైట్ల నుంచి తనకు ప్రాణభయం వున్నా ప్రజల కోసం తాను పల్లెలు పట్టుకు తిరుగుతున్నానని చంద్రబాబు చెప్పారు.

16వ విడత జన్మభూమి కార్యక్రమం రెండో రోజున రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్ల్యేలు జిల్లాల్లో విస్తృత స్థాయిలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో వున్న ప్రాంతాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X