లక్నోః
ఉగ్రవాదాన్ని
విడనాడేందుకు
పాకిస్తాన్
సిద్ధంగా
లేదని
భారత
ప్రధాని
వాజ్
పేయి
ధ్వజమెత్తారు.
గత
కొద్ది
రోజులుగా
పాకిస్తాన్
వైఖరిని
పరిశీలిస్తే
ఈ
విషయం
స్పష్టం
అవుతుందని
ఖాట్మండూకు
బయలుదేరే
ముందు
ఆయన
లక్నోలో
విలేకరులతో
అన్నారు.
ఇప్పటి
వరకు
తన
భూభాగంలో
వున్న
తీవ్రవాద
సంస్థలపై
పాకిస్తాన్
కంటితుడుపు
చర్యలు
మాత్రమే
తీసుకున్నదిని
ఆయన
అన్నారు.
తీవ్రవాద
సంస్థలపై
పాకిస్తాన్
తీసుకున్న
చర్యల
పూర్తి
వివరాలు
భారత్
కు
కావాలి....
డిసెంబర్
13న
భారత్
పార్లమెంటుపై
దాడి
జరిపిన
వారిపై
పాక్
చర్య
తీసుకున్నదీ
లేనిదీ
తేలాలి
అని
వాజ్
పేయి
అన్నారు.
పాకిస్తాన్
కొందరు
తీవ్రవాదుల్ని
అరెస్టు
చేసినట్లు
వార్తా
పత్రికలద్వారా,
దౌత్య
వర్గాల
ద్వారా
సమాచారం
అందింది.
అయితే
పాక్
అరెస్టు
చేసిన
వారి
వివరాలు
ఏమిటి,
పార్లమెంటుపై
దాడి
చేసిన
వారిపై
ఏమైనా
చర్యలు
గైకొన్నదా
అనే
వివరాలు
వెల్లడించకపోవడం
విచారకం
అని
వాజ్
పేయి
అన్నారు.
కంటితుడుపు
చర్యలు
కాకుండా
పకడ్బందీగా
తీవ్రవాద
సంస్థలను
నిర్మూలించే
దిశగా
చర్యలు
తీసుకొని
తన
చిత్తశుద్ధిని
పాక్
నిరూపించుకోవాలని
వాజ్
పేయి
అన్నారు.
యుద్ధం
అంటూ
వస్తే
భారత్
ముందుగా
అణ్వాయుధాలను
ప్రయోగించదని
వాజ్
పేయి
ఓ
ప్రశ్నకు
సమాధానంగా
చెప్పారు.
పాక్
తో
వున్న
విభేదాలను
దౌత్యపరమైన
మార్గాలద్వారానే
పరిష్కరించుకొనేందుకు
భారత్
ప్రయత్నించిందని
వాజ్
పేయి
అన్నారు.
సార్క్
సదస్సు
సందర్భంగా
ముషారఫ్
తో
చర్చలు
జరిపే
అవకాశం
లేదని
వాజ్
పేయి
మరోసారి
తేల్చి
చెప్పారు.