వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఖరి మారని పాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండుః పాకిస్తాన్‌ వైఖరి ఎంతమాత్రం మారలేదు. భారత్‌ కోరుతున్న విధంగా 20 మంది తీవ్రవాదులను అప్పగించాలంటే వారి నేరాలకు తగిన సాక్ష్యాలను చూపించాలని పాకిస్తాన్‌ డిమాండ్‌ చేసింది. సార్క్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పాకిస్తాన్‌, భారత్‌ అగ్రనేతల మధ్య చర్చల కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాక్‌ ధోరణి తీవ్రవిఘాతం కలిగించే అవకాశం వున్నదని అంటున్నారు. తాము అందజేసిన జాబితాలోని టెర్రరిస్టులను తమకు అప్పగిస్తే చట్టం ప్రకారం వారిపై విచారణ జరిపిస్తామని భారత్‌ అంటున్నది. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కోర్టులో కేసులు నిలబడవన్న విషయం తమకు బాగా తెలుసునని సాక్ష్యాలు వున్నందువల్లే వారిని ప్రాసిక్యూట్‌ చేయాలని నిర్ణయించామని ఆ మాత్రం పాకిస్తాన్‌ అర్ధం చేసుకోకపోతే ఎలా అని భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

జైష్‌ నేత మౌలానా మసూద్‌ అజార్‌ అయిదేళ్లపాటు ఎలాంటి విచారణ లేకుండానే భారత్‌ బందీఖానాలో వున్నారని సాక్ష్యాలు ఆధారాలు వుంటే విచారణ లేకుండా అజార్‌ను జైల్లో ఎందుకు వుంచారని పాకిస్తాన్‌ ప్రశ్నిస్తున్నది. ఉభయదేశాల పట్టుదల కారణంగా ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏ మాత్రం లేకపోవడంతో నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా మధ్యవర్తిత్వం వహించి భారత్‌, పాకిస్తాన్‌ నేతల మధ్య సమావేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. నేపాల్‌ ప్రధాని దౌత్యానికి అమెరికా ఆశీస్సులు కూడా వున్నాయని అంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X