వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఖరి మారని పాక్
ఖాట్మాండుః పాకిస్తాన్ వైఖరి ఎంతమాత్రం మారలేదు. భారత్ కోరుతున్న విధంగా 20 మంది తీవ్రవాదులను అప్పగించాలంటే వారి నేరాలకు తగిన సాక్ష్యాలను చూపించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. సార్క్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పాకిస్తాన్, భారత్ అగ్రనేతల మధ్య చర్చల కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు పాక్ ధోరణి తీవ్రవిఘాతం కలిగించే అవకాశం వున్నదని అంటున్నారు. తాము అందజేసిన జాబితాలోని టెర్రరిస్టులను తమకు అప్పగిస్తే చట్టం ప్రకారం వారిపై విచారణ జరిపిస్తామని భారత్ అంటున్నది. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కోర్టులో కేసులు నిలబడవన్న విషయం తమకు బాగా తెలుసునని సాక్ష్యాలు వున్నందువల్లే వారిని ప్రాసిక్యూట్ చేయాలని నిర్ణయించామని ఆ మాత్రం పాకిస్తాన్ అర్ధం చేసుకోకపోతే ఎలా అని భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
Story first published: Thursday, January 3, 2002, 23:53 [IST]