వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరభారతంలో భూకంపం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గురువారం మధ్యాహ్నం పెను భూకంపం ఉత్తర భారతాన్ని కుదిపివేసింది. రెక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.8గా నమోదైంది. ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ కు ఈశాన్య భాగంలో 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రతకు ఢిల్లీ, జమ్మూ, పంజాబ్‌, హర్యానాల్లో ప్రకంపనాలు సంభవించాయి. గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం 46 సెకండ్ల పాటు కొనసాగింది.

భూకంపం కారణంగా ఇస్లామాబాద్‌, పెషావర్‌, కాబూల్‌, మజారే షరీఫ్‌ లలో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఏ విధమైన నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. భూమి లోపల 130 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X