వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాబితాలపై కాంగ్రెస్‌, దేశం కసరత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపిస్తుండడంతో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు జాబితాలు ఖరారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బిజెపికి 45 కార్పొరేషన్లు కేటాయించి తాను 55 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ ఆ డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధం అవుతున్నది.

కాంగ్రెస్‌ పార్టీ కూడా వామపక్షాల మద్దతుతో రాష్ట్రరాజధాని నగరంలో పాగా వేయాలని భావిస్తున్నది. మేయర్‌ అభ్యర్థి పదవికి విద్యా వంతుడు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్‌ రెడ్డిని పోటీకి దించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోపైపు సిపిఎం 15 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసింది. లౌకిక వాద పార్టీలు నిలబెట్టే మేయర్‌ అభ్యర్థికి వామపక్షాలు మద్దతు ఇస్తాయని సిపిఎం చెబుతున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X