వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతసంస్థలపై వేటుకు పాక్‌ సన్నాహం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్‌ నడుంకట్టాలంటూ అమెరికా తదితర దేశాల నుంచి ఒత్తుళ్ళు పెరుగుతున్న తరుణంలో కొన్ని మతసంస్థలపై పాక్‌ నిషేధం విధించే అవకాశాలున్నా యంటున్నారు. పాక్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందే జిహాద్‌ గ్రూపులకు నిధులు, ఆయుధాలు అందించే కొన్ని సంస్థలపై పాక్‌ ప్రభుత్వం నిషేధం వేటు వేసే అవకాశాలున్నట్లు ఇస్లామాబాద్‌ వర్గాల ద్వారా తెలిసింది.

ఇస్లాం పేరిట ఒకరిని ఒకరు చంపుకొనే వారిని తీవ్రవాదులుగానే పరిగణిస్తామని పాక్‌ మంత్రి ఘాజి చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. కాశ్మీర్‌ లో జరుగుతున్న పోరాటానికి పాకిస్తాన్‌ కేవలం నైతికమైన, దౌత్యపరమైన మద్దతు మాత్రమే ఇస్తున్నది...... అయితే కాశ్మీర్‌ స్వతంత్ర యుద్ధం పేరిట జిహాద్‌ కార్యకలాపాలు నిర్వహించే అధికారం ఎవరికీ లేదని ముషారఫ్‌ మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రి అయిన ఘాజీ వ్యాఖ్యానించినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది.

పాక్‌ భూభాగంలో జీహాద్‌ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే జీహాద్‌ సంస్థలకు ఇక్కడ వున్న వారు ఎవరైనా నిధులు సమకూర్చుతుంటే మాత్రం పాకిస్తాన్‌ శ్రేయస్సుకు అది మంచిది కాదని ఘాజి అన్నారు. మొత్తం మీద నానాటికీ పెరుగుతున్న ఒత్తిళ్ళ దరిమిలా మత సంస్థలపై పాక్‌ కంటితుడుపు చర్యలైనా తీసుకొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X