వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసాధారణ భద్రత మధ్య రిపబ్లిక్‌ వేడుకలు

By Staff
|
Google Oneindia TeluguNews

కాన్పూర్‌ః ఇంగ్లాండ్‌ తో కాన్పూర్‌ లో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 8వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పిచ్‌ తడిగా వుండడంతో 39 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ లో ఇంగ్లాండ్‌టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 15 ఓవర్లలోనే చకచకా వంద పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌ మెన్‌ ఇన్నింగ్స్‌ ను అదే ఊపులో కొనసాగించలేక పోయారు. నిక్‌ నైట్‌ చక్కగా ఆడి 74 పరుగులు చేసినామిగిలిన బ్యాట్స్‌ మెన్‌ అంతా విఫలం అయ్యారు. దీంతో ఇంగ్లాండ్‌ ను భారత్‌ 217 పరుగులకే పరిమితం చేసింది.

ఆ తరువాతవీరేంద్ర సెహవాగ్‌, సచిన్‌ టెండుల్కర్‌ భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.సెహవాగ్‌ చెలరేగి ఆడాడు. 62 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఆ తరువాత గంగూలీ 26 పరుగులకు అవుటయ్యాడు. 66 బంతుల్లో సచిన్‌ 87 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. దినేష్‌ మోంగియా 17 బంతుల్లో 17 పరుగులుచేసి నాటౌట్‌ గా నిలిచాడు.

మంచి దూకుడుగా ఆడిని వీరేంద్ర సెహవాగ్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. కాన్పూర్‌విజయంతో ఆరు మ్యాచ్‌ ల సిరీస్‌ లో భారత్‌ 3-1 ఆధిక్యంలో వుంది. ఐదో మ్యాచ్‌ 31న ఢిల్లీలో జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X