వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామీణ న్యాయస్థానాలు: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రామ సచివాలయాల మాదిరిగా రాష్ట్రంలో గ్రామీణ న్యాయ స్థానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తూళ్ల దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. పోలీసు రిట్రీట్‌ ముగింపు సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు.

గ్రామాల్లోని చిన్నపాటి తగాదాలను పరిష్కరించడానికి ఒక వ్యవస్థ అవసరమని,అందుకు గాను గ్రామీణ న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని, దీని వల్ల పోలీసులపై భారం తగ్గుతుందని ఆయన అన్నారు.

నిరుడు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఒక్క లాకప్‌ మరణం కూడా సంభవించకుండా జాగ్రత్త పడాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. లాకప్‌ మరణాలు గణనీయంగా తగ్గాయని ఆయన చెప్పారు. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సి వున్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X