జార్ఖండ్‌లో పోలీసుస్టేషన్‌పై దాడి

రాయ్‌పూర్‌: నిషిద్ధ మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్‌ (ఎంసిసి) సాయుధ తీవ్రవాదులు జార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో గల ఒక పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయని మంగళవారం పోలీసులు చెప్పారు.

ఈ సంఘటనలో ఇరు వైపులా ఎవరూ మరణించలేదు. దాదాపు 50 మంది సాయుధ తీవ్రవాదులు అత్యధునాతన ఆయుధాలతో వచ్చి పోలీసుస్టేషన్‌ టెలిఫోన్‌ లైన్‌ను కట్‌ చేశారు. పోలీసులతో దాదాపుఅరగంట సేపు తలపడ్డారు. ఆ తర్వాత తీవ్రవాదులు పారిపోయారు. తీవ్రవాదుల కోసం లతేహార్‌, పలమావు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+