వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్‌ సిటీలో దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైటెక్‌ సిటీకి అత్యంత సమీపంలో సోమవారం నాడు పట్టపగలు అల్లాబక్ష్‌ అనే 47 ఏళ్ల రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. మాదాపూర్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలో వేళ్లూనుకున్న లాండ్‌ మాఫియా కార్యకలాపాలకు ఈ సంఘటన చిరు నిదర్శనమని చెప్పవచ్చు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు అల్లాబక్ష్‌ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడుఅర్జున్‌ ఆయన సోదరుడు రాజు, వారి పనిమనిషి దాసు,స్వామి అనే మరో వ్యక్తి కలసి అల్లాబక్ష్‌ ఇంటిలోనే ఆయనపై దాడి జరిపారు. ప్రాణభయంతో ఇల్లువిడిచి పోలీస్‌స్టేషన్‌ దిశగా కేకలు పెడుతున్న అల్లాబక్ష్‌ను వందలాది మంది చూస్తుండగా రోడ్డుపై వెంటాడి రోకలి బండతో బాది, గ్రానెట్‌ రాళ్లతో కొట్టి అత్యంత
కిరాతకంగా చంపారు. రియల్‌ఎస్టేట్‌ గొడవలే ఇందుకు కారణమని చెబుతున్నారు.అర్జున్‌ రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు వ్యతిరేకంగా అల్లాబక్ష్‌ న్యాయస్థానానికి వెళ్లివిజయం సాధించారని కోర్టు తీర్పు మేరకు రోడ్డుకు అడ్డంగాఅర్జున్‌ నిర్మించిన దుకాణాలను కూల్చివేయడానికి శేరిలింగంపల్లి మున్సిపల్‌ అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో రెచ్చిపోయినఅర్జున్‌ ఆయన సహచరులు ఈ హత్యకు పాల్పడ్డారని తెలిసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X