వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ పై చోగమ్‌ బహిష్కారం కొనసాగింపు

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః కామన్‌ వెల్త్‌ దేశాల కౌన్సిల్‌ నుంచి పాకిస్తాన్‌ బహిష్కరణ కొనసాగుతుంది. ఆస్ట్రేలియాలో మార్చిలో జరిగే కామన్‌ వెల్త్‌ దేశాల కౌన్సిల్‌ సమావేశానికి పాకిస్తాన్‌ ను ఆహ్వానించబోవడం లేదని కామన్‌ వెల్త్‌ కార్యదర్శి డాన్‌ మెక్‌ నానన్‌ చెప్పారు. పాక్‌ పై ఇంకా బహిష్కరణ కొనసాగుతున్నది కాబట్టి ఆ దేశ ప్రతినిధిని చోగమ్‌ కు ఆహ్వానించడం సమంజసం కాదని గురువారం లండన్‌ ఆయన వ్యాఖ్యానించారు.

54 సభ్య దేశాలున్న చోగమ్‌ పాకిస్తాన్‌ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కానందుకు గాను బహిష్కరణను కొనసాగిస్తున్నట్లు ముషారఫ్‌ కు వర్తమానం పంపింది. మానవహక్కులు, ప్రజాస్వామ్య పరిస్థితుల ఆధారంగా చోగమ్‌ లో సభ్యంతం వుంటుంది. 1999అక్టోబర్‌ లో ముషారఫ్‌ సైనిక చర్యద్వారా పాకిస్తాన్‌ లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టినవిషయం విదితమే. దీంతో కామన్‌ వెల్త్‌ నుంచి పాక్‌ ను బహిష్కరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X