వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్‌ వెనుక భారత్‌ హస్తం: పాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: అమెరికా జర్నలిస్టుపెరల్‌ కిడ్నాప్‌ వెనుక భారత ప్రభుత్వ హస్తం వున్నదని పాకిస్థాన్‌ గురువారం ఆరోపించింది. ఈ కిడ్నాప్‌ వెనుకు భారత్‌ హస్తం వున్నదని మాత్రమే చెప్పగలనని, ఇంత కన్నావివరాల్లోకి వెళ్లలేనని పాకిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధి రషీద్‌ ఖురేషి అన్నారు.

అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ ప్రతిష్టను మంట కలిపేందుకు భారత్‌ నాటకమాడుతోందని,పెరల్‌ కిడ్నాప్‌ ఈ నాటకంలో భాగమేనని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై తాము దర్యాప్తు జరిపిస్తున్నామని, వాస్తవాలు త్వరలో వెలుగు చూస్తాయని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ ఆరోపణను భారత్‌ ఖండించింది. ఇది పాకిస్థాన్‌సైనిక ప్రతినిధి కల్పన అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి నిరుపమా రావు అన్నారు. ఇంత కన్నా తాను ఏం చెప్పగలనని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X