వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర ఐ.టి కి ఉతీమ్‌ ప్రశంస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తున్న ప్రగతిని మారిషస్‌ అధ్యక్షుడు కాసమ్‌ ఉతీమ్‌ ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం హైదరాబాద్‌విచ్చేసిన ఉతీమ్‌ గురువారం నాడు పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ కేంద్ర శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హైటెక్‌ సిటీని సందర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న ఇ-సేవా ప్రాజెక్టును ఉతీమ్‌ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఐ.టి. కార్యదర్శి జె. సత్యనారాయణ ఉతీమ్‌ కు ట్విన్స్‌ ప్రాజెక్టు, ఇ-సేవాసర్వీసులను వివరించారు. చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్ళడంతో ఉతీమ్‌ పర్యటన నిరాసక్తంగా సాగుతున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X