మైసురాకు ఉద్వాసన- కాంగ్రెస్లోసంక్షోభం
హైదరాబాద్:మినీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి రాష్ట్ర కాంగ్రెస్లోపెను సంక్షోభాన్ని సృష్టించింది. కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు డాక్టర్ఎం. వి. మైసురా రెడ్డిని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో వున్నారు.
ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ కార్యదర్శి ఎం. కోదండరెడ్డికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, పిసిసి షోకాజ్ నోటీసులు అందుకున్ననాయకులు ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమికి బాధ్యతవహించ లేక పిసిసి అధ్యక్షుడు ఇతర నాయకులపైవిరుచుకపడుతున్నారని మైసురా రెడ్డి ఢిల్లీలోఅంటున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని,రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ అంబికా సోనీని తానుకలిసినందుకే తనను సిఎల్పి కార్యదర్శి పదవినుంచి తప్పించారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.తాను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పని చేస్తున్నాననిఆయన చెపుతున్నారు.












Click it and Unblock the Notifications
