వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై తెలుగుదేశం ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాబడ్జెట్‌పై కాంగ్రెస్‌ చేసిన విమర్శలను గురువారం తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టింది. ముసాయిదాబడ్జెట్‌ను చదవకుండానే కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా బాధ్యతవిస్మరించి విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, పారదర్శకతను అడ్డుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయనవిమర్శించారు. ముసాయిదాను చదవకుండా విశ్లేంచకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తేస్తుందని, పన్నులు వేస్తుందని ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముసాయిదాబడ్జెట్‌ను తాము ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాబడ్జెట్‌పై సిపిఎం తీవ్ర విమర్శలు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈబడ్జెట్‌ను రూపొందించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులువిమర్శించారు. ఇది ప్రజలకు హానీ చేసేబడ్జెట్‌ అని ఆయన అభివర్ణించారు. సబ్సిడీలను 2,650 కోట్ల రూపాయల నుంచి 1,450 కోట్ల రూపాయలకు తగ్గించడం వల్ల ప్రజలకు నష్టంజరుగుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X