వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాక్సిడెంట్‌ లో సినీ నిర్మాత మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరుః చిత్తూరు జిల్లా నగరి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు సినీ నిర్మాత యార్లగడ్డ శంభుప్రసాద్‌ దుర్మరణం పాలయ్యారు. ఈయన ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కూడా. ఆయనతో పాటు ఆయన సతీమణి ప్రభావతి, పరుచూరి బ్రదర్స్‌ లో మూడో వారైన పరుచూరి కుటుంబరావు కూడా మరణించారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని సందర్శించుకొని శంభుప్రసాద్‌ చెన్నయ్‌ వెళుతున్నారు.

వీరు బయలు దేరిన కారును ఓ లారీ డీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న శంభుప్రసాద్‌, ప్రభావతి అక్కడికక్కడే మరణించారు. పరుచూరి కుటుంబరావు తిరుపతి ఆస్పత్రిలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. యార్లగడ్డ శంభుప్రసాద్‌ నమ్మినబంటు వంటివిజయవంతమైన చిత్రాలతో పాటు పలు తెలుగు చిత్రాలను నిర్మించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X