వచ్చే ఏడాది ఆంధ్రకు బిల్గేట్స్
న్యూయార్క్: వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ను సందర్శించడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్అంగీకరించారు. మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్గేట్స్తో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ప్రగతిని, గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను ఆయన బిల్గేట్స్కువివరించారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే ఏడాది హైదరాబాద్ రావడానికి బిల్గేట్స్అంగీకరించారు.
మోన్శాంటోతో అవగాహన
ప్రపంచ ప్రసిద్ధి చెందిన మోన్శాంటో తనపరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తుంది. హైదరాబాద్లో ఏర్పాటయ్యే ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్లోఈ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. ఈ మేరకు మోన్శాంటో కంపెనీ ప్రెసిడెంట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెండ్రిక్ ఎ వెర్ఫైలే రాష్ట్రప్రభుత్వంతో ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు. ఆదివారంనాడిక్క ఈ అవగాహనా పత్రంపై సంతకాలు జరిగాయి.
రాష్ట్రంలో బయోటెక్నాలజీని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నాలుగు అమెరికన్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఎంఒయును కుదుర్చుకుంది. దీనిపై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఎపిఐడిసి) వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్, అమెరికన్ బయోటెక్ కంపెనీలు జినోమిక్స్ యుఎస్ఎ, బయోసెర్వ్ యుఎస్ఎ, జినోమిక్ డిజైన్ ఫార్మాస్యూటికల్స్, సిలికోఇండైట్స్ ఇన్కార్పోరేషన్లు సంతకాలు చేశాయి.












Click it and Unblock the Notifications
