వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరల్‌ కేసు: అమెరికాకు జిలాని అప్పగింత

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: అమెరికా జర్నలిస్టు డేనియల్‌పెరల్‌ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడైన ముబారక్‌ అలీ షా జిలానీని అమెరికాకుఅప్పగించాలని పాకిస్థాన్‌ నిర్ణయించుకున్నట్లు సోమవారం ప్రతికలురాశాయి. కిడ్నాప్‌ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కరస్పాండెంట్‌ పెరల్‌ ఆచూకీ తనకు తెలియదని చెప్పినప్పటికీ వినకుండా పాకిస్థాన్‌ జిలానీని అమెరికాకుఅప్పగించాలని నిర్ణయించుకుంది.

కిడ్నాప్‌నకు ముందు జిలానీ భారత్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది.
పేరు తెలియని సంస్థ కొన్ని సంస్థల నుంచి నాలుగు లక్షల డాలర్లు తీసుకున్నట్లుఅమెరికా అధికారులు ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో జిలానీని అమెరికాకుఅప్పగిస్తున్నట్లు ది నేషన్‌ అనే పత్రిక రాసింది. ముగ్గురు ప్రముఖ భాతర అధికారులతో జిలానీ మాట్లాడినట్లు పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ మూడు రోజుల క్రితం చెప్పారు. దీంతో జిలానీపేరు కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రముఖంగా ముందుకు వచ్చింది. జిలానీ నాలుగు రోజుల క్రితం రావల్పిండిలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X