వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎనిమిది మంది పోలీసుల కాల్చివేత
చాత్రా ( జార్ఖండ్)ః జార్ఖండ్ లోని జోరిఘాట్ జిల్లాలో మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్ తీవ్రవాదులు ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపారు. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. జోరిఘాట్ సమీపంలోని చాత్రా-గయ రోడ్డును ట్రాక్టర్ అడ్డంపెట్టి తీవ్రవాదులు మూసివేశారు. ఆ తరువాత అటుగా వస్తున్న పోలీస్పెట్రోలింగ్ వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. జోరి పోలీస్టేషన్ ఇన్ ఛార్జ్ తో పాటు ఎనిమిది మంది పోలీసులు ఈ కాల్పుల్లో మరణించారు.
Comments
Story first published: Monday, February 4, 2002, 23:53 [IST]