వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిపై దాడి: ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్‌: మణిపూర్‌లోని కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిపై సాయుధమిలిటెంట్లు దాడి చేసి ఒక భద్రతా జవానుతో పాటు ఇద్దర్ని హత్య చేశారు. ఈ దాడిలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు మణిశంకర్‌ అయ్యర్‌, కాంగ్రెస్‌ హీరోక్‌ నియోజకవర్గం అభ్యర్థిఎం. ఓకేంద్రో హీరోక్‌ పార్ట్‌ టూ ఏరియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి వచ్చిన పది నిమిషాలకే ఈ సంఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎకె 47రైఫిల్స్‌తో మిలిటెంట్లు ఓకేంద్రో ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు.మిలిటెంట్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో మణిపూర్‌రైఫిల్స్‌ జవానుతో పాటు ఒక పార్టీ కార్యకర్త మరణించారు.

ఓకేంద్రో మాత్రం సురక్షితంగా బయట పడగలిగారు. ఈ దాడిలో మరో నలుగురు కార్యకర్తలకు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X