వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరెంట్ షాక్ పై కాంగ్రెస్ రణభేరి
హైదరాబాద్ఃవిద్యుత్ ఛార్జీలు పెంచాలనే తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఏప్రిల్ లో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సోమవారం హైదరాబాద్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు టి. వెంకట్రావు ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్ లో అన్ని జిల్లాల యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ తో పాటు పలువులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమం విధివిధానాల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్ని అంతర్గత కుమ్మలాటలే సమవేశంలో ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి.
Comments
Story first published: Monday, February 4, 2002, 23:53 [IST]