వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్‌ షాక్‌ పై కాంగ్రెస్‌ రణభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃవిద్యుత్‌ ఛార్జీలు పెంచాలనే తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించాలని కాంగ్రెస్‌ పార్టీ సంకల్పించింది. ఏప్రిల్‌ లో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సోమవారం హైదరాబాద్‌ లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో నిర్ణయించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు టి. వెంకట్రావు ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌ లో అన్ని జిల్లాల యూత్‌ కాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్‌ తో పాటు పలువులు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉద్యమం విధివిధానాల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్ని అంతర్గత కుమ్మలాటలే సమవేశంలో ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి.

సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా వుండటాన్ని చూసిఓర్వలేకే పార్టీలో కొందరు నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పిసిసి నేత ఎం.సత్యనారాయణ రావు అన్నారు. పార్టీలో అనైక్యత కారణంగానే ఇటీవల జరిగినమినీ మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిందని పలువురు యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వై.ఎస్‌., ఎమ్మెస్సార్‌ సారధ్యంలో కాంగ్రెస్‌ పార్టీపూర్వవైభవాన్ని సంతరించుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్‌ మాట్లాడుతూ తనపై అనవసరంగా బురద చల్లుతున్న వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారంతాపేపర్‌ టైగర్స్‌ అని దుయ్యబట్టారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X