వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో పెట్టుబడులకు బాబు పిలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ఃవిశాఖ జోన్‌ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్రమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు బుధవారం నాయుడు 50కిపైగా కంపెనీల అధినేతలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూవిశాఖజోన్‌ లో పరిశ్రమలు నెలకొల్పే వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

పదేళ్ళ పాటు ఆదాయం పన్ను నుంచిమినహాయింపునిస్తామని ఆయన చెప్పారు. లాభాలస్వీకరణకు ఎటువంటి పరిమితులు విధించమని కూడా చంద్రబాబువివరించారు. వివిధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఉన్నతాధికారులు బృందం మరికొద్దిరోజాలు పాటు అమెరికాలోనే వుండి కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ లో పరిశ్రమలు ప్రారంభిస్తే కలిగే ప్రయోజనాలను పారిశ్రామిక వేత్తలు, ఎన్నారైలకువివరిస్తుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X