వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐర్లాండ్‌ నేతలతో బాబు భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః అమెరికావిమానం జరిపిన క్షిపణి దాడిలో అంతర్జాతీయ తీవ్రవాద ఒసామాబిన్‌ లాడెన్‌ మరణించాడని వార్తలు వెలువడ్డాయి.పైలట్‌ లేని సిఐఎ విమానం సోమవారం రాత్రి ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌ లోసీనియర్‌ అల్‌ ఖైదా నేతలు సమావేశం అయిన సందర్భంగా క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో లాడెన్‌ తో పాటు ప్రముఖ అల్‌ ఖైదా నేతలు కూడా దుర్మరణం పాలయ్యారని భావిస్తున్నారు.

ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌ లోని జవార్‌ ఖలీపర్వత గుహల వద్ద ఈ క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో పలువురుసీనియర్‌ అల్‌ ఖైదా నేతలు మరణించారని అమెరికా వర్గాలు చెబుతున్నప్పటికీ వారిలో లాడెన్‌ వున్నదీ లేనిదీ అమెరికా ఇంకా నిర్ధారించలేదు. తోరాబోరా గుహల నుంచి పారిపోయిన లాడెన్‌ జవార్‌ ఖలీ గుహల్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.పైలట్‌ లేని ప్రిడేటర్‌ విమానాన్ని శత్రువుల వేటకోసం అమెరికా ప్రయోగించడం ఇదే ప్రథమం. అది శత్రువులపై క్షిపణులనుకూడా ప్రయోగిస్తుంది. పాక్‌ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈవిమానం దాడి జరపగా అల్‌ ఖైదా నేతలు మరణించినట్లు భావిస్తున్నారు. అయితే ఆఫ్గనిస్తాన్‌ నుంచిఅందుతున్న వార్తల ప్రకారం ప్రిడేటర్‌ విమానం దాడిలో అల్‌ ఖైదా నేతలు ఎవరు మరణించలేదని తెలుస్తున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X