న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారుల ప్రతినిధులతో ఢిల్లీలో ఒక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. భారత పోలీసు సర్వీసులో తొలి మహిళా అధికారి కిరణ్బేడీ అధ్యక్షతన ఈ సమ్మేళనం జరుగుతున్నది.
పోలీసు శాఖలో తాము సాధించినవిజయాలు, ఎదుర్కుంటున్న సమస్యలను వారు కలబోసుకుంటారు. దేశం నలుమూలలనుంచి వస్తున్న రెండువందల మంది మహిళా పోలీసు అధికారులు,బ్రిటన్ నుంచి వస్తున్న కొందరు ప్రత్యేక ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్,బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి.