వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలేకరులపై ముఖ్యమంత్రి రుసరుస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అసెంబ్లీలో జరిగిన చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇచ్చి విలేకరులు వార్తలు రాస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నాడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా గుండ్ల పోచంపల్లి గ్రామంలో మహిళలకు దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమానికిపెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎన్నో మంచిపనులు చేస్తున్నదని ప్రజలకోసం ఉపయోగపడే ప్రాజెక్టులను చేపడుతున్నదని అన్నారు.వీటిగురించి పట్టించుకోకుండా చిన్నవిషయాలను కొండంతలుగా చేసి రాస్తారని ఆయన దుయ్యబట్టారు. ఇకనుంచి వ్యవసాయం, ఉపాధికల్పన రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ రెండుఅంశాలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు 12 వేల మంది డ్వాక్రా మహిళలకు దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఆధునిక పద్దతుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X