వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య ఎన్నికల ఎజెండా కాదు: జార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: అయోధ్య ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఎజెండా కాదని రక్షణ మంత్రి, సమతా పార్టీసీనియర్‌ నేత జార్జి ఫెర్నాండెజ్‌ అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఈవిషయంలో ఎన్‌డిఎను దుయ్యబడుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఉత్తరప్రదేశ్‌కు సోమవారం బయలుదేరే ముందు ఆయన బీహార్‌లోని బుక్సర్‌లోవిలేకరులతో మాట్లాడారు.

కార్గిల్‌ అమరవీరుల కోసం కొనుగోలు చేసిన శవపేటికల విషయంలో ప్రతిపక్షాలువిమర్శలకు దిగడాన్ని ఆయన ఎద్దేవా చేస్తూ- ఇటువంటిఅంశాన్ని లేవనెత్తడం బౌద్ధిక దివాళాకోరుతనమని అన్నారు. ఈవిషయంపై పార్లమెంటులో తాము వివరణ ఇచ్చామని, సాయుధ బలగాల నైతిక స్థయిరాన్నిదెబ్బ తీసే ప్రకటనలు ప్రతపక్షాలు మానుకోవడం మంచిదని ఆయన అన్నారు.

పాక్‌ యుద్ధం జరిగే అవకాశాలు లేవని, సరిహద్దుల వద్ద పరిస్థితి ప్రశాంతంగా వుందని, కానీ తాము అప్రమత్తంగానే వున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X