వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనికి ఆహారం కోసం ఆసెంబ్లీ తీర్మానం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పనికి ఆహార పథకాన్ని వచ్చేజూన్‌ వరకు పొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ గురువారం ఒక తీర్మానం ఆమోదించింది.పేదలు, బడుగు వర్గాలకు ప్రాణదాతగా మారిన ఈ పథకాన్ని పొడిగించడంఎంతైనా అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ పథకం కొనసాగాలన్నదే తమ అభిమతమని అయితే పనికి ఆహార పథకం తెలుగుదేశం ఆహార పథకంగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. పనికి ఆహార పథకం ద్వారా కేంద్ర నుంచిఅందుతున్న బియ్యంలో 60 శాతం దుర్వినియోగం అవుతున్నాయని,మిగిలినవి తెలుగుదేశం కార్యకర్తలకే అందుతున్నాయని కాంగ్రెస్‌ లెజిల్లేచర్‌ పార్టీ నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు.

ఈ అక్రమాలనుఅరికట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుని వై.ఎస్‌. నిలదీశారు. కేంద్రం నుంచి ఎన్ని బియ్యం వచ్చినా అక్రమాలు జరుగుతుంటే అవిపేదలకు అందవని ఆయన అన్నారు. పనికి ఆహారపథకంలో జరుగుతున్న అక్రమాలపై సభా సంఘం ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ ను ప్రభుత్వం త్రోసిపుచ్చింది. ప్రభుత్వ వైఖరిపట్ల కాంగ్రెస్‌ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ పథకంలో అక్రమాలనుఅరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటామని అయితే ఈ పథకాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ తీర్మానం ఆమోదించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని చంద్రబాబు నాయుడుకోరారు. అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడంతో పనికి ఆహార పథకాన్నిజూన్‌ వరకు పొడిగించాలని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X