వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో 48 మంది మావోయిస్టుల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండు: భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో నేపాల్‌లో 48 మంది మావోయిస్టు తిరుగుబాటు దారులు హతమయ్యారు. తిరుగుబాటును అణచివేయడానికి మూడు నెలల క్రితం విధించిన అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ పార్లమెంటు గురువారం ఓటు చేయనున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.

నేపాల్‌లోని నాలుగు పశ్చిమ ప్రాంత జిల్లాల్లో ఇరు పక్షాల మధ్య ఘర్షణల అనంతరం భద్రతా బలగాలు 46 మంది మావోయిస్టు తీవ్రవాదులను కాల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశంలోని మరో ప్రాంతంలో మరోఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపినట్లు ఆ ప్రకటనలో చెప్పారు.

ఇంకా ఎక్కువ మందే చనిపోయి వుంటారని, కొన్ని మృతదేహాలను తిరుగుబాటుదారులు తీసికెళ్లారని,అందువల్ల మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదని అన్నారు.

సంఘటనా స్థలాల నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలుస్వాధీనం చేసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X