వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ లక్ష్యం 121 - స్కోర్‌ 35/3

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః న్యూఢిల్లీలోని ఫిరోజ్‌ షా కొట్లా మైదానంలో జింబాంబ్వేతో జరుగుతున్న రెండోటెస్ట్‌ లో స్పిన్నర్లు విజృంభించడంతో భారత్‌విజయదిశగా పయనిస్తున్నది. హర్భజన్‌ సింగ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆరువికెట్లు, కుంబ్లే నాలుగు వికెట్లు తీసుకోవడంతో జింబాంబ్వే రెండో ఇన్నింగ్స్‌ 146 పరుగులకే ముగిసింది. దీంతో జింబాంబ్వేకు 121 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా ఒకరోజు ఆటమిగిలి వుండడంతో ఈ తక్కువ లక్ష్యం సాధించడం భారత్‌ కు అసాధ్యం కాదు.

6 వికెట్ల నష్టానికి 319 పరుగులతో నాలుగో రోజు బరిలోకి దిగిన భారత్‌ గంగూలీ వెంటనే అవుటయ్యాడు. కుంబ్లే కాస్త ధాటిగా ఆడి 34 పరుగులు చేశారు.మిగిలిన వారెవరూ నిలబడలేకపోవడంతో భారత్‌ 354 పరుగులకు ఆలౌట్‌అయింది. కేవలం 25 పరుగులు ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్‌ స్పిన్నర్ల మాయాజాలంతో జింబాంబ్వే రెండో ఇన్నింగ్స్‌ ను 146 పరుగులకే కుప్పకూల్చింది. దీంతోవిజయ లక్ష్యమైన 121 పరుగుల కోసం భారత్‌ ఆట ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభంలో దీప్‌ దాస్‌ గుప్తా రనౌట్‌ అయ్యాడు. ఆ తరువాత గ్రాండ్‌ ఫ్లవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసిఒకే ఓవర్‌ లో గంగూలీ, కుంబ్లేను అవుట్‌ చేసాడు.

దీంతో రెండో టెస్టు రసపట్టులో పడుంది. 86 పరుగుల లక్ష్యంతో భారత్‌ సోమవారం బరిలోకి దిగితుంది. సచిన్‌, దాస్‌ క్రీజ్‌ లో వున్నారు.సెహవాగ్‌ భుజానికి గాయం కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.సెహవాగ్‌ కూడా లేకుండా స్పిన్‌ బాగా తిరుగుతున్న పిచ్‌ లో భారత్‌విజయం సాధిస్తుందో లేక చతికిల పడుతుందో వేచి చూడాలి. మళ్ళీ భారమంతా సచిన్‌పైనే వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X