వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరుపురాని నేత బాలయోగి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః లోక్‌సభ స్పీకర్‌, మాజీ మంత్రి దివంగత గంటి మోహన చంద్ర బాలయోగికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సోమవారం నాడు శోకతప్త హృదయంతో ఘనంగా నివాళులర్పించింది. సభలోని పలువురు మంత్రులు, సభ్యులకు బాలయోగితో వున్న వ్యక్తి గత అనుబంధం ఈ సందర్భంగా కన్నీళ్ల రూపంలో వ్యక్తమయింది.

సోమవారం నాడు సభ సమావేశం కాగానే అన్ని కార్యక్రమాలను పక్కనబెట్టి బాలయోగి సంతాప తీర్మానాన్ని చేపట్టారు. సభ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. గద్గదస్వరంతో ఆయన సంతాప తీర్మానాన్ని చదివారు. సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, సిపిఎం నేత నోముల నర్సింహ్మయ్య, ఎంఐఎం నాయకుడుఅసదుద్దీన్‌ ఒవైసీ, బిజెపి నాయకుడు ఇంద్రసేనారెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకుడు చంద్రశేఖర్‌రావు కూడా బాలయోగి గుణగణాలను ప్రస్తుతించారు. అజాత శత్రువుగా పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. అన్ని వర్గాలు, పక్షాలతోనూ ఆత్మీయంగా మెలిగారని శ్లాఘించారు. మంత్రిగా పనిచేసిన కాలంలో బాలయోగితో తమ అనుబంధాన్ని పలువురు నాయకులు ప్రస్తావించారు. హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ కన్నీళ్లుపెట్టుకున్నారు.తూర్పుగోదావరి జిల్లాల్లో బాలయోగి చొరవతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన పేరు పెట్టాలని, అమలాపురంలో ఆయన స్మృతి చిహ్మ ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X