రాజధానిలో ఛేజింగ్-బందిపోటు హతం
హైదరాబాద్ః మూడు గంటల పాటు మెదక్ నుంచి చార్మినార్ వరకు మూడు జిల్లాలకు చెందిన పోలీసులు జాతీయరహదారిపై చేజింగ్ చేసి ఒక బందిపోటును కాల్చి చంపారు. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన సినిమా ఫక్కీలో సాగింది.
మెదక్ జిల్లా పటాన్ చెరు సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు తెలుపురంగు మారుతి కారులు నలుగురు వచ్చారు. పెట్రోలు పోయించుకొని ఒక్కసారిగా బంక్ క్యాషియర్ నుంచి బ్యాక్ లాక్కున్నారు. అడ్డుకోబోయిన వారిని తపంచాతో బెదిరించి కారులో పారిపోయారు.బంక్ సిబ్బంది విషయాన్ని పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటాన్ చెరు పోలీసులు రంగంలోకి దిగి కారును ట్రేస్ చేశారు. కారు హైదరాబాద్వైపు వెళుతున్నదని గ్రహించి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పటాన్ చెరు పోలీసులు దారి కాచినా ఆ కారును అడ్డుకోలేక పోయారు. మియాపూర్ చౌరాస్తాలో పోలీసులు - కారులోని ఆగంతకుల మధ్య మూడు రౌండ్లు కాల్పులు జరిగాయి. కారు దూసుకుపోవడంతో జాతీయ రహదారిపై చేజింగ్ ప్రారంభం అయింది. కూకట్ పల్లి, సనత్ నగర్, మూసాపేట వద్ద కూడా పోలీసులు, కారులోని దుండగుల మధ్య కాల్పులు జరిగాయి.