వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిలో ఛేజింగ్‌-బందిపోటు హతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మూడు గంటల పాటు మెదక్‌ నుంచి చార్మినార్‌ వరకు మూడు జిల్లాలకు చెందిన పోలీసులు జాతీయరహదారిపై చేజింగ్‌ చేసి ఒక బందిపోటును కాల్చి చంపారు. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన సినిమా ఫక్కీలో సాగింది.

మెదక్‌ జిల్లా పటాన్‌ చెరు సమీపంలోని ఒక పెట్రోల్‌ బంక్‌ వద్దకు తెలుపురంగు మారుతి కారులు నలుగురు వచ్చారు. పెట్రోలు పోయించుకొని ఒక్కసారిగా బంక్‌ క్యాషియర్‌ నుంచి బ్యాక్‌ లాక్కున్నారు. అడ్డుకోబోయిన వారిని తపంచాతో బెదిరించి కారులో పారిపోయారు.బంక్‌ సిబ్బంది విషయాన్ని పటాన్‌ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటాన్‌ చెరు పోలీసులు రంగంలోకి దిగి కారును ట్రేస్‌ చేశారు. కారు హైదరాబాద్‌వైపు వెళుతున్నదని గ్రహించి చందానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పటాన్‌ చెరు పోలీసులు దారి కాచినా ఆ కారును అడ్డుకోలేక పోయారు. మియాపూర్‌ చౌరాస్తాలో పోలీసులు - కారులోని ఆగంతకుల మధ్య మూడు రౌండ్లు కాల్పులు జరిగాయి. కారు దూసుకుపోవడంతో జాతీయ రహదారిపై చేజింగ్‌ ప్రారంభం అయింది. కూకట్‌ పల్లి, సనత్‌ నగర్‌, మూసాపేట వద్ద కూడా పోలీసులు, కారులోని దుండగుల మధ్య కాల్పులు జరిగాయి.

అయినా ఆ దుండగులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్ల ఒక ఆగంతకుడు మరణించాడు. మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పోలీసులు అర్థరాత్రి మూడు గంటల పాటు చేజ్‌ చేసి చివరకు చార్మినార్‌ సమీపంలో ఆ కారును పట్టుకోగలిగారు. ఆ కారులో చావుబతుకుల మధ్య వున్న బందిపోటు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి కన్నుమూశాడు. గాయపడిన మరో వ్యక్తిని కూడా కారులో వదిలేసిమిగిలిన ఇద్దరూ తప్పించుకొని పారిపోయారు. ఢిల్లీకి చెందినవీరు హైదరాబాద్‌ లో వుంటూ దోపిడీలు చేస్తుంటారని పోలీసులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X