అనపర్తిః ఎన్ని అవాంతరాలు ఎదురైనా నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని హోం మంత్రిదేవేందర్గౌడ్ చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గురువారం నాడు ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నక్సల్స్ హింసాకాండకు పాల్పడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూచోదని చెప్పారు. అదే సమయంలో నక్సల్స్తో చర్చలకు తాము సిద్ధంగా వున్నామని ప్రకటించారు.