వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్‌ సిఎం పుస్తకాలు చదవరా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చరిత్ర గురించి సమాజాన్ని గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు పుస్తకాలు చదవాలని రాష్ట్రపతి పదవికి వామపక్షాల అభ్యర్ధిగా పోటీ చేస్తున్న 87 ఏళ్ల వృద్ధ నేత లక్ష్మీ సెహగల్‌ పెద్ద తరహాగా ఒక సలహా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారం నాడు హైదరాబాద్‌కు వచ్చారు.

విమానాశ్రయం నుంచి ఆమెను వామపక్ష కార్యకర్తలు స్కూటర్‌ ర్యాలీతో మఖ్దూం భవన్‌ వరకు తీసుకువెళ్లారు. ఆ తర్వాతవిలేకరుల సమావేశంలో మాట్లాడిన లక్ష్మీసెహగల్‌, చంద్రబాబుకు వ్యక్తి గతంగా తాను తెలియకపోవడం గురించి తానేమీ పట్టించుకోవడం లేదని అయితే నేతాజీ సారథ్యంలోని ఐఎన్‌ఎస్‌ కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా వున్నదని ఆమె చెప్పారు. చంద్రబాబును హైటెక్‌ సిఎంఅంటారని తాను విన్నానని పుస్తకాలు చదువకున్నా అనేక వైబ్‌సైట్లలో ఐఎన్‌ఎస్‌ చరిత్ర గురించి వున్నదని ఆమె తెలిపారు. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ తాను బిజెపి మతోన్మాద రాజకీయాలను ఎదుర్కోవడానికే పోటీలోకి దిగానని ఎన్నికల తర్వాత కూడా తన పోరాటం సాగుతుందని ఆమె చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X