వెంకయ్య టీమ్విజయ లక్ష్యం
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ కొత్త నేతగా బాధ్యతలుస్వీకరించిన వెంకయ్యనాయుడు 72 మందితో కొత్తకార్యవర్గాన్ని గురువారం నాడు ప్రకటించారు. ఈ టీమ్లో పలువురు సీనియర్ నేతలు వున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్సింగ్, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, ముక్తార్ అబ్బాస్ నక్వీని పార్టీ ప్రధానకార్యదర్శులుగా నియమించారు.
భారతీయ జనతా యువమోర్చా కొత్త అధ్యక్షునిగా కిషన్రెడ్డిని నియమించారు. వచ్చే ఏడాదిఅసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీ నుంచి మాజీ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ను, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి గోపినాథ్మూండేను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. కాగా మరో ఢిల్లీ నేత అనితా ఆర్యను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కోశాధికారిగా రామ్దాస్అగర్వాల్ను నియమించారు.












Click it and Unblock the Notifications