వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ బంద్‌ ప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్లకు నిరసనగాపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు తలపెట్టిన బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది.పీపుల్స్‌వార్‌ తలపెట్టిన రెండు రోజుల బంద్‌ గురువారం ప్రారంభమైంది. బంద్‌కు ముందు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్‌కౌంటర్లు, ప్రభుత్వ కార్యాలయాల విధ్వంసం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అవాంఛనీయ సంఘటనలేవీ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు బుధవారం రాత్రి ప్రకాశం జిల్లాపెద డోర్నాల ఎంపిడివో కార్యాలయాన్ని పేల్చి వేశారు. ఇదిలా వుంటే కరీంనగర్‌ జిల్లా నేరెళ్ల ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం మెజిస్టీరియల్‌విచారణకు ఆదేశించింది. ఉత్తర తెలంగాణలో పరిస్థితి ప్రశాంతంగా వుంది. హైదరాబాద్‌లో బంద్‌ ప్రభావం కనిపించలేదు. నగరంలోకి వస్తున్న వాహనాలను జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ పాక్షికంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు పని చేశాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. ఎన్‌కౌంటర్‌లో మరణించినపీపుల్స్‌వార్‌ నేత పద్మక్క స్వస్థలం జమ్మికుంటలో బంద్‌ పూర్తి స్థాయిలో జరిగింది. కరీంనగర్‌ జిల్లాలో ఆర్టీసి బస్సులు యథావిధిగా జరిగాయని అధికార వర్గాలు చెప్పాయి.

వరంగల్‌ జిల్లాలో కూడా బంద్‌ ప్రభావం పాక్షికంగానే ఉంది. ఆర్టీసి బస్సులు నడిచాయి. నక్సల్స్‌ ప్రభావం అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు బస్సులను నడపలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X