వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి షిండే?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికిసీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సుశీల్‌ కుమార్‌ షిండేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దింపాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) అభ్యర్థిగా రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి బైరాన్‌ సింగ్‌ షెకావత్‌ రంగంలోకి దిగారు. షెకావత్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

షెడ్యూల్‌ కులానికి చెందిన షిండే రెండు విడతలు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఎఐసిసి) ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి ఆయన లోక్‌సభకు రెండో సారి 1999లో ఎన్నికయ్యారు. ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఒక విడత పని చేశారు.
షిండే మొదటిసారి 1974లో కర్మలా నియోజక వర్గం నుంచి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 నుంచి 1992 వరకు మహారాష్ట్ర మంత్రి వర్గాల్లో వివిధ శాఖలను నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా తొమ్మిది సార్లుబడ్జెట్‌ను ప్రతిపాదించి ఆయన రికార్డు సృష్టించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X